Monday, April 29, 2024

ఇంట్లో లొల్లి, ఆర్థిక ఇబ్బందులు.. యువజంట ఆత్మహత్య

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్​ జిల్లాలో ఇవ్వాల (గురువారం) జరిగింది. వెల్దుర్తి ఉమ్మడి మాసాయిపేట మండలంలో ఈ ఘటన జరిగింది. మాసాయిపేట గ్రామానికి చెందిన కాషమైన మహేష్ (22). భార్య హేమలత కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో గొడవ పడ్డారు. మహేష్ స్థానిక శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద తన తండ్రి దర్శన్ కండ్ల ముందే ట్రైనుకు ఎదురుగా వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు.

భర్త ఆత్మహత్య విషయం తెలుసుకున్న హేమలత ఇంట్లో ఉరి వేసుకొని తానూ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఓ కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సంఘటనా స్థలాన్ని రైల్వే ఎస్సై తవ్వు నాయక్, రామాయంపేట సిఐ లక్ష్మీ బాబు, చేగుంట ఎస్సై హరీష్ పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement