Saturday, April 27, 2024

మార్చి 3 నుంచి ప‌టాన్ చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు : ఎమ్మెల్యే జీఎంఆర్‌

ప‌టాన్ చెరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 3, 4, 6 తేదీలలో పటాన్ చెరు కేంద్రంగా నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించబోతున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ప‌టాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల మహిళా అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు 20 సంవత్సరాలుగా మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 3, 4, 6 తేదీలలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రెండు రోజులు మైత్రి క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వివిధ అంశాలలో క్రీడా పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6వ తేదీన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బహుమతుల ప్రధానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులచే ఉపన్యాసాలు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో సంబరాలకు హాజరై దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్, మెట్టు రమాదేవి కుమార్ యాదవ్, ఎంఈఓలు, సెర్ప్ ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement