Friday, May 17, 2024

షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాగ్రి దగ్ధం…

నిజాంపేట, (ప్రభన్యూస్) : షాక్‌ సర్క్యూట్‌తో ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్దం అయిన సంఘటన నిజాంపేట మండల పరిదిలోని నార్లాపూర్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ మేరకు నార్లాపూర్‌ గ్రామానికి చెందిన పూల్లూరి కృష్ణరెడ్డి ఇంట్లో ఉదయం ప్రమాదవశాత్తు షాక్‌ సర్క్యూట్ వల్ల ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తి కాలిపోయ్యింది.

దీంతో ఇంట్లో రూ. 6 వేల నగదు తోపాటు టీవీ, మంచాలు, ఫ్రీడ్జీ పూర్తిగా కాలిపోయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ గంగ ప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకుని కాలిపోయిన సామాగ్రిని పరిశీలించారు.బాదితుని న్యాయం చేకూరేలా పై అదికారులకు తెలియజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అమరసేనారెడ్డి, కార్యదిర్శ ప్రశాంత్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement