Friday, March 29, 2024

క్రీడలకు సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన జీఎంఆర్ ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైత్రి మైదానంలో ఏడాది పొడవునా వివిధ క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. మనిషి జీవితంలో చదువు, సంపాదనతో పాటు శారీరక ధారుఢ్యం, మానసిక ఉల్లాసం ఎంతో ప్రాముఖ్యమన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచితే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. రెండు రోజులపాటు జరగనున్న టోర్నమెంట్లో 32 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప‌టాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ బీసన్న, జాతీయ వాలీబాల్ అంపైర్లు అమర్, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, ముస్తఫా, నిర్వాహకులు యంజాల్ సాయి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement