Monday, April 29, 2024

భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

పటాన్ చెరు, ప్రభ న్యూస్ : వివాహం కోసం నిశ్చితార్థమైన యువతి మనస్థాపానికి గురై మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్ చెరు పట్టణంలో శనివారం ఉదయం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని నాయి కోటి బస్తీలో నివసించే యువతికి ఇటీవలే మేనభావతో వివాహ నిశ్చితార్థం జరిగింది. కాగా కట్న కానుకల విషయంలో పెళ్లి కుమారుని కుటుంబ సభ్యులు యువతి తల్లిదండ్రులను వేధించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి తాను నివసిస్తున్న నాయికోటి బస్తీలోని మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకొని సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement