Friday, April 26, 2024

కౌడిప‌ల్లిలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌..

మెద‌క్ జిల్లోని కౌడిపల్లి గ్రామంలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. కౌడిప‌ల్లి (దాబా) పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై పాపన్నపేట్ మండలం చీకోడ్ గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు(30) వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు హ‌త్య చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తూప్రాన్ డీఎస్పి యాదగిరి రెడ్డి, సీఐ శ్రీధర్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement