Monday, April 29, 2024

ఘనాపూర్ లో ఘనంగా గ్రామదేవతల జాతర

పటాన్చెరు, ప్రభ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన రేణుక ఎల్లమ్మ తల్లి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పాటు, యాదగిరిగుట్ట, కొండగట్టు, వేములవాడ, ఏడుపాయల తదితర దేవస్థానాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సొంత నిధులతో 175 కు పైగా దేవాలయాలను నిర్మించినట్లు తెలిపారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల నిర్మాణాలకు సైతం సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరి అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్యకాశి రెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, మెరాజ్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement