Saturday, April 27, 2024

MDK: ఆటోను ఢీకొన్న కారు.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

కౌడిపల్లి, నవంబర్ 16 (ప్రభ న్యూస్): కారు అతివేగంగా ఆటోను ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన మండల పరిధిలోని ధర్మసాగర్ గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే… నాక్సన్ పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పామ్ ఆంజనేయులు అల్మాయిపేట అంజయ్య (50) కౌడిపల్లి సమీపాన గల రైస్ మిల్లులో వడ్లు పట్టించుకొని, బియ్యం బస్తాలను ఆటోలో తీసుకొని నాక్సన్ పల్లికి వెళ్లుండగా అతివేగంగా హైదరాబాద్ నుండి మెదక్ వైపు వెళ్తున్న కారు ధర్మసాగర్ గేటు సమీపాన ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో అల్మాయిపేట అంజయ్య మృతిచెందగా, డ్రైవర్ ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న బర్మావత్ తాండకు చెందిన రెడ్యానాయక్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కౌడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement