Saturday, May 4, 2024

క్రీడకారులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు : యువత చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని పాటి గ్రామ పరిధిలోని ఏర్పాటు చేసిన పాటి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ప్రతి గ్రామంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ లక్ష్మయ్య, పటాన్‌చెరు కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, స్వామిగౌడ్‌, క్రీడాకారులు, కార్యక్రమ నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement