Friday, May 3, 2024

బస్తీ దవాఖానను ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మీ

మేయర్ గద్వాల విజయలక్ష్మీ నగరంలో పర్యటిస్తున్నారు. ఖైరతాబాద్ మహా భారత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ…. డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాలన్నారు. అలాగే దేశంలోకి ఒమిక్రాన్ ఎంటరైందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. అలాగే శానిటైజర్లు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బస్తీ దవాఖానను ప్రారంభించిన సందర్భంగా మేయర్ వైద్యులతో కొన్ని హెల్త్ చెకప్ లు చేయించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement