Sunday, April 28, 2024

MBNR: మిరప పంట పొలంలో గంజాయి మొక్కలు.. కేసు నమోదు

గద్వాల (ప్రతినిధి), నవంబర్ 9 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లాలో విశ్వసనీయ సమాచారం మేరకు గట్టు మండలంలోని బలిగెర గ్రామం పోతుల ఈరన్న మిరప పొలంలో గంజాయి మొక్కల వేశారన్న సమాచారంతో పొలంలో గంజాయి మొక్కల కోసం సోదా చేయగా (45) గంజాయి మొక్కలను గుర్తించారు. వాటిని పెకిలించడం జరిగిందని, శాంపిల్ తీసిన తరువాత మిగిలిన మొక్కలను కాల్చివేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

వీటిని పెంచిన ఈరన్నను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా ఈరన్నకు మెజిస్ట్రేట్ రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారి జీడీ గోపాల్ తెలిపారు. పొలంలో దొరికిన గంజాయి మొక్కల విలువ 4 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో ఇన్ స్పెక్టర్లు గోపాల్ జీడీ, పటేల్ బానోత్, సబ్ ఇన్ స్పెక్టర్లు రాజేందర్, క్రిష్ణ, కానిస్టేబుళ్లు వేణు, మహేష్, రాజు, షబ్బీర్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement