Sunday, May 19, 2024

భూపాలపల్లిలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలోని పెగడపల్లి, కనకునుర్ గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. గ్రామాల్లోని ప్రధాన కుడళ్లు, రోడ్లపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), జయశంకర్ భూపాల పల్లి, వరంగల్ 2, పెద్దపల్లి, (జేయం డబ్ల్యూసీ ) డివిజన్ కమిటీ పేరిట కరపత్రాలు దర్శనమిచ్చాయి. ’50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించాలని కరపత్రంలో ముద్రించి ఉంది. షెడ్యూల్డ్ 5, 6, పేసా చట్టాల ప్రకారం ఏజెన్సీలో ఆదివాసులు పుర్తి హక్కులు కలిగి ఉంటారని, ఆదివాసీ సొసైటీల ద్వారా తునికాకు సేకరించి, రేట్లు నిర్ణయించి అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి ఖర్చు చేసే అధికారం ఆదివాసీ సొసైటీలకు ఉంటుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం టెండర్లు నిర్వహించి హక్కులను కాలరాస్తుందని కరపత్రంలో ముద్రించి ఉంది. ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడి తునికాకు సేకరించే కూలీల శ్రమ దోపిడీ చేస్తూ, కాంట్రాక్టలు కిలో ఆకుకు రూ. 300 విక్రయిస్తున్నారని, 50 ఆకుల కట్టకు 3 రూపాయలు వెచ్చించాలన్నారు. ప్రజలు ఉద్యమం చేయాలని కరపత్రంలో ముద్రించి ఉంది.’ కరపత్రాలు లభ్యం కావడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement