Wednesday, May 8, 2024

శ్రీలంక‌కి బియ్యం-పాల‌పొడి-మందులు పంపుతున్నాం – ప్ర‌జ‌లు విరాళాలు ఇవ్వండి-సీఎం స్టాలిన్

తొలి దశలో బియ్యం, పాలపొడి, ప్రాణాలను రక్షించే మందులను శ్రీలంకకు పంపనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. అలాగే ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీజేపీ నేతృత్వంలోని సమాఖ్య ప్రభుత్వ అనుమతితో భయంకరమైన ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న శ్రీలంకకు త్వరలో 40,000 టన్నుల ఆహారం, 500 టన్నుల పాలపొడి, ప్రాణాలను రక్షించే ఔషధాలను రాష్ట్రం పంపుతుందని స్టాలిన్ చెప్పారు.
ద్వీప దేశానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసి ..రవాణా చేయడానికి మానవతా ప్రాతిపదికన ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. తూత్తుకుడి నౌకాశ్రయం నుంచి శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని తమిళులకు, అలాగే తోటల్లో పని చేసే వారికి అవసరమైన ఆహార ధాన్యాలు, కూరగాయలు, మందులు వంటి వాటిని రవాణా చేసేందుకు అనుమతించాలని స్టాలిన్ గతంలో అభ్యర్థించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement