Thursday, April 25, 2024

మ‌హారాష్ట్ర‌లో అనేక స‌మ‌స్య‌లు.. బిఆర్ ఎస్ ని గెలిపించండి.. కేసీఆర్

జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బిఆర్ ఎస్ స‌త్తాని మ‌రాఠా చూపించాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.కేవ‌లం ఒక్క బ‌ట‌న్ నొక్కండి.. దేశ‌మంతా మారిపోతోంది అని కేసీఆర్ అన్నారు. మ‌హారాష్ట్ర‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అవ‌న్నీ ప‌రిష్కారం కావాలి. నా మాట‌ల్లో నిజం ఉంది. గులాబీ జెండా భుజాన వేసుకుని క‌ద‌లిరండి అని పిలుపునిచ్చారు. దేశ‌మంతా గులాబీ జెండా ఎగ‌రాలి.. కిసాన్ స‌ర్కార్ రావాలి. మ‌హారాష్ట్రలో ఊరురా కిసాన్ క‌మిటీలు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో మ‌హారాష్ట్ర అంతటా ప‌ర్య‌టిస్తాన‌ని కేసీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement