Friday, May 17, 2024

పురుగుల మందు త్రాగి వ్యక్తి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన బల్మురి సీతారాంరావ్ (55) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య సమస్యతో సోమవారం తన పొలం వద్ద పురుగుల మందు త్రాగాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4 గంటలకు మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement