Thursday, April 25, 2024

TS: ఈట‌ల స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన మల్లంపేట్ బీఆర్ఎస్ కౌన్సిలర్

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట 21వ‌ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎంబరి లక్ష్మి ఆంజనేయులు ఇవాళ‌ మల్లంపేట్ లోని ఎస్ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ల‌ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. మల్లంపేట్ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎంబరి లక్ష్మి – ఆంజనేయులుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండిగూడెం గణేష్, గాండ్ల బాలరాజు, కొండా శ్రీకాంత్ లతో పాటు సుమారు 200 మంది బీజేపీలో చేరగా, వారికి ఈటల రాజేందర్, కూన శ్రీశైలం గౌడ్ లు కమలం కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.


మల్కాజ్ గిరి పార్లమెంట్ లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డా.ఎస్ మల్లారెడ్డి, కౌన్సిలర్ రాము గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్, కౌన్సిలర్ రాజిరెడ్డి, మల్లేష్ యాదవ్, గోనె మల్లారెడ్డి, అతిష్ బాబు, నర్సింగ రావ్, శ్రీనివాస్ గౌడ్, మురళి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement