Sunday, May 5, 2024

TS: ధర్మ ప్రదక్షణకు యువత నడుంబించాలి…ఎమ్మెల్యే వాకిటి

మక్తల్, ఫిబ్రవరి19(ప్రభన్యూస్) ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని హిందు ధర్మ పరిరక్షణకోసం యువత నడుంబిగించాలని మొత్తం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణ వద్ద నిర్వహించిన చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ సైన్యం వలె ప్రతి యువకుడు కూడా దేశం కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement