Sunday, April 28, 2024

TS : రైలు కింద పడి మహిళ మృతి

మక్తల్, ఏప్రిల్4 (ప్రభన్యూస్) : ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఇవాళ ఉదయం పొలాలకు వెళ్తున్న వ్యక్తులు రైలు పట్టాలపై ఓ మహిళ శవం పడి ఉండడాన్ని గుర్తించారు.

ఈ విషయంను రైల్వే పోలీసులకు చేరవేశారు .రైల్వే ట్రాక్ సమీపంలోనే ఉన్న కొత్త గార్లపల్లి గ్రామానికి చెందిన పోలమ్మ (50)గా మృతి చెందిన మహిళను స్థానికులు గుర్తించారు. మృతురాలికి మతిస్థిమితం సరిగ్గా లేదని అంటున్నారు. అర్ధరాత్రి తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇవాళ తెల్లవారుజామున రైలు ప్రమాదంలో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. తల ,శరీరం భాగాలు వేరువేరుగా పడి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement