Wednesday, May 1, 2024

MBNR: అల్లా దయతో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలి..

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల (ప్రతినిధి) ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్) : గద్వాల పట్టణం, రాఘవేంద్ర కాలనీలో గల ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండాలని, తద్వారా అన్ని వర్గాల ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో జీవించేలా అల్లాను ప్రార్థించాలని ముస్లిం సోదరులను కోరారు.

తెలంగాణ రాష్ట్రం గద్వాల ప్రాంతంపై అల్లా దయ ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గద్వాల మండలం, గోనుపాడు ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, గద్వాల పిఎసిఎస్ చైర్మన్ సుభాన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్ కుమార్ జడ్పిటిసి రాజశేఖర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, నరహరి శ్రీనివాసులు, విష్ణుప్రియ దౌలు, పట్టణ అధ్యక్షులు గోవింద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement