Friday, May 3, 2024

TS: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలి… కలెక్టర్ బి.ఎం.సంతోష్

గద్వాల ప్రతినిధి, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్): విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా మైదాన పరిసరాలను, తేరు మైదానంలో ఖేలో ఇండియా క్రీడల కేంద్రాన్ని పరిశీలించారు.

- Advertisement -

ఇండోర్ స్టేడియంలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జిమ్, షటిల్, తైక్వాండో ఇతర సదుపాయాలు కల్పించడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. అనంత‌రం క్రికెట్, కరాటే, పుట్ బాల్ తదితర క్రీడలలో రాణించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రికెట్ బ్యాటింగ్, షటిల్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి బిఎస్ ఆనంద్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ జితేందర్, పుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్, పి ఈ టి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ, ఖేలో ఇండియా అధికారి శ్రీనివాసులు, మహిళా పిఈటి సంఘం అధ్యక్షులు హైమావతి, పిఈటిల సంఘం కార్యదర్శి శైలజ, టైక్వాండో రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, శ్రీనివాసులు అరుణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement