Sunday, April 28, 2024

TS: విజయ సంకల్ప బస్సు యాత్రను ప్రారంభించిన ఎంపీ సోయం

నిర్మల్ ప్రతినిధి, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్): బాస‌ర శ్రీ‌జ్ఞాన స‌రస్వ‌తీ అమ్మ‌వారిని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ముథోల్ ఎమ్మెల్యే రామారావుప‌టేల్‌లు ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అంత‌కుముందు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం విజయ సంకల్ప యాత్ర బస్సులను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురవు,ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మాజీ ఎంపి రమేష్ రాథోడ్‌లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి మాట్లాడారు. రాబోయే ఎంపి ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భాజపా పార్టీ ఎంపి అభ్యర్థి ని భారీ మెజారిటీగా గెలిపించాలని కోరారు. ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని కోరారు.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement