Friday, May 3, 2024

TS: రాష్ట్రానికి ఎన్‌డీఎస్ఏ అధికారులు… స‌ర‌స్వ‌తీ బ్యారేజీ ప‌రిశీల‌న‌…

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఇవాళ రాష్ట్రానికి రానుంది. బ్యారేజీలో వాటర్ లీకేజీ విషయాన్ని ఇంజనీర్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లగా.. మూడు బ్యారేజిల్లో నీళ్ల స్టోరేజి అంశాన్ని ఎన్‌డీఎస్‌ఏకు ప్రభుత్వం అప్పగించింది. ఈమేర‌కు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతీ) బ్యారేజీని ఎన్‌డీఎస్‌ఏ అధికారులు పరిశీలించనున్నారు.

- Advertisement -

ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకోనుంది. మరమత్తుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి.

కాగా ఈ బ్యారేజీలోపలుమార్లు సీపేజ్‌లు ఏర్పడగా.. ఆప్కాన్స్‌ సంస్థ ఇప్పటికే కెమికల్‌ గ్రౌటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్‌లకు పూర్తిస్థాయి ట్రీట్‌మెంట్‌ చేయడంతోపాటు బ్యారేజీలోని లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్‌ సంస్థకు ఇన్వెస్టిగేషన్‌ బాధ్యతలను అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement