Wednesday, May 15, 2024

TS: సమ్మక్క దర్శనానికి భక్తులు.. అగ్నికి ఆహుతైన గుడిసెలు..

కరీంనగర్ లోని ఆదర్శనగర్ లో ఉంటున్న గుడిసె వాసులు సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారంకు వెళ్లారు. అయితే ఇవాళ ఉదయం 10గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గుడిసెల్లో ఉన్న గాస్ సిలిండర్లు పేలి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల జనం పరుగులు తీశారు.

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపుచేశారు. మంటలు వ్యాప్తి చెందిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ గుడిసెల్లో ఎక్కువగా వడ్రంగి, కమ్మరి వారు నివశిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో 20గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement