Sunday, May 5, 2024

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య.. పది పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకే..

తిమ్మాజిపేట, ప్రభన్యూస్‌: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాన నే మనస్తాపంతో ఉప్పరి శేఖర్‌(15) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని బావాజీ పల్లి గ్రామంలో చోటు-చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం బావాజీ పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్‌ పోతిరెడ్డిపల్లిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడగా ఓ సబెక్ట్‌లో తప్పాడు. ఫెయిల్‌ అయ్యానని ఆందోళనతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు సేవించాడు.

అరుస్తూ భయంతో బయటికి రావడంతో గమనించిన చుట్టు-పక్కలవారు హుటాహుటిన జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement