Sunday, April 28, 2024

MBNR: బహిరంగ సభకు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

గ‌ద్వాలప్రతినిధి, ఫిబ్రవరి 13 (ప్రభ న్యూస్): మంగళవారం రోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల నిర్వహణ బాధ్యత కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో జరగబోయే బహిరంగ సభకు గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి వేలాదిమంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు బస్సులలో బయలుదేరడం జరిగింది.

ఎమ్మెల్యే కూడా కార్యకర్తలతో కలిసి బస్సులో నల్గొండ సభకు బయలుదేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్రములో పదేళ్లు కెసిఆర్ పాలనలో సుభిక్షంగా ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ముఖ్యంగా రైతాంగానికి నీరు కరెంటు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణ జిల్లా ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు రమేష్ నాయుడు, చక్రధర్ రావు, విక్రమ్ సింహారెడ్డి తూం కృష్ణ రెడ్డి, గద్వాల టౌన్, అన్ని మండల పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement