Monday, April 29, 2024

MBNR: బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బండ్ల

గద్వాల ప్రతినిధి, ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : శుక్రవారం రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రధాతగా బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమ‌న్నారు. బాబు జగ్జీవన్ రామ్ బడుగు, బలహీన వర్గాల ఆషాజ్యోతి నిరంతర కృషీవలుడు భారతదేశ స్వరాజ్యంతో పాటు ఈ దేశ పునరనిర్మాణంలో ఏంతో ముఖ్య పాత్ర పోషించారన్నారు.

మొదటిసారి అంటరానితనం, అణచివేతలకు గురైన దళితుల పక్షాన నిలబడి కుల వివక్షపై ఆగ్రహించిన తొలి నాయకులు బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు. దళిత జాతి అభ్యున్నతికీ ఎంతగానో తొడ్పాడ్డారని ఎమ్మెల్యే ఈ సందర్బంగా కొనియాడారు. ఈకార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, బీఆరెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, కౌన్సిలర్లు మురళి, దౌలు, నరహరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement