Thursday, May 2, 2024

ఎమ్మెల్యేకు వినతి పత్రం..

దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని పర్కాపురం నుంచి దమగ్నాపూర్‌ గ్రామం వరకు బిటి రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డికి గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ గ్రామానికి బీటీ రోడ్డు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు బీటీ రోడ్డు వేయమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. అందుకు మాపై దయ ఉంచి మా గ్రామానికి వెంటనే బీటీ రోడ్డు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ బీటీ రోడ్డు వేయడానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement