Monday, April 29, 2024

కోట మైసమ్మను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దమందడి : మండల పరిధిలోని అల్వాల గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవతను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. అమ్మ క్రీ.శే.తారకమ మీద రూ.50 వేలు ఇవ్వడం జరిగిందని స‌ర్పంచ్ సువ‌ర్ణ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. రూ.50లక్షల దాతల సహకారంతో శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవత గుడి నిర్మాణం పూర్తి కావడంతో గత మూడు రోజుల నుండి కోట మైసమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించినట్లు స్థానిక సర్పంచ్ తెలిపారు. చివరి రోజున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమ్మ‌వారిని ద‌ర్శించుకుని, ఆయ‌న‌ నిధుల నుండి రూ.ఐదు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామం తరపున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అద్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మి కాంతారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిన్న వెంకటరెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement