Tuesday, April 30, 2024

MBNR: వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

వనపర్తి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 7 (ప్రభ న్యూస్); కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పట్టణ పుర వీధుల్లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి, నియోజకవర్గ నాయకులు ఎంపీపీ మెగా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి, మెగా రెడ్డి మాట్లాడుతూ… రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి సెప్టెంబర్ 7న ఏడాది పూర్తి అవుతోందని.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ జనంతో మమేకమయ్యారన్నారు. జోడో యాత్ర తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర 2పై అప్ డేట్ ఇచ్చిందన్నారు. త్వరలోనే రెండో దఫా యాత్రను రాహుల్ గాంధీ చేపట్టనున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement