Friday, April 26, 2024

గ్రామ గ్రామాన బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

దేవరకద్ర :మండలంలో గ్రామగ్రామాన బిజెపి కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. బిజెపి పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కొండా అంజన్‌ కుమార్‌ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే మండల పరిధిలోని గురకొండ , గోపులాపురం , కౌకుంట్ల , గోపన్పల్లి , డోకూరు , మినిగోని పల్లె , తదితర గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాలను ఎగరవేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ది గురించి ప్రజలకు వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిఠాయి పంపిణీ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి యజ్ఞభూపాల్‌ రెడ్డి, దేవన్న సాగర్‌ , సాయిరాజు , కరెంట్‌ ఊషన్న , నారాయణ రెడ్డి , చంద్రశేఖర్‌ , విష్ణు వర్దన్‌ రెడ్డి , ఆంజనేయులు , రాములు , రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement