Thursday, May 2, 2024

Gadwal: రాష్ట్ర మంత్రులను సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే

గద్వాలప్రతినిధి,డిసెంబర్ 27 (ప్రభ న్యూస్) బుధవారం ఉమ్మడి మహబూబ్‌న‌గర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం మందిరంలో గురువారం రోజు నుండి జరగబోయే ప్రజా పాలన గురించి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ దామోదర రాజ నర్సింహా, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ రాములు, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, హాజరయ్యారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ , ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహకు మరియు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావును గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎం.పీ రాములు, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement