Sunday, April 28, 2024

MBNR : అగ్నిగుండం తొక్కిన భక్తులు

మక్తల్, ఏప్రిల్13(ప్రభన్యూస్) నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని యాదవ్ నగర్ లో వెలసిన శ్రీ వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ ఉదయం భక్తులు అగ్నిగుండం తొక్కారు. ఆలయం ఆవరణలో భ‌క్తులు భగ మండుతున్న ఎర్రటి నిప్పుల కనికలపై నడుచుకుంటూ తమ భక్తిని చాటుకున్నారు.

- Advertisement -

అగ్నిగుండం తొక్కిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండం కార్యక్రమం తర్వాత అర్చకులు శివయ్య, సంతోష్ ల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు .ఈ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement