Sunday, April 28, 2024

HYD: రెండు కార్లు ఢీకొని.. ఇద్ద‌రు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..

రెండు కార్లు ఢీకొని ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడా చౌరస్తా వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈప్ర‌మాదంలో స్పాట్ లోనే ఇద్దరు మృతిచెందారు. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ర‌వి, ప్ర‌ణ‌య్ లు గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement