Saturday, April 27, 2024

MBNR: వంద పడకల హస్పిటల్ లో చోరీకి యత్నం…మంత్రి రాకతో తెరిచిన దవఖాన

మానవపాడు, జనవరి27(ప్రభన్యూస్): అలంపూర్ చౌరస్తాలోని వందపడకల హస్పిటల్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి దామోదర రాజనర్సింహ శనివారం పరిశీలించండానికి రావడంతో అధికారులు హస్పిటల్ తలుపులు తెలిచారు. అధికారులు రూంలను శుభ్ర పరుస్తుడడంతో ఎలక్ట్రిక్ రూం లోకి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ అద్దాలను తోలిగించి మేయిన్ కేబుల్ లను కత్తిరించి కేబుల్ ఎత్తకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈవిషయాన్ని వైద్యఅధికారులు, హస్పిటల్ కంట్రాక్టర్ ఈవిషయాన్ని మంత్రికి,పాలకులకు తెలియకుండా మభ్యపెట్టారు. ఈవిషయం చర్చనీయాంశంగా మారింది.వంద పడకల హస్పిటల్ లో లక్షల విలువ గల వైద్యాపరికరాలు ఉన్నాయి.వైద్య అధికారులు మాత్రం ఏమి ఎరుగనట్లు వ్యవహరించడంపై అనుమానాలు తావిస్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి హస్పిటల్ భద్రతా పెంచాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement