Sunday, May 5, 2024

Mahabubnagar – ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శన ఈ నెల 28 కి వాయిదా… శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్,జులై 21 (ప్రభ న్యూస్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 23 న ట్యాంక్ బండ్ పై నిర్వహించదలచిన డ్రోన్ ప్రదర్శనను ఈ నెల 28 కి వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన గణేష్ నగర్,ఎర్రకుంట ల లో పర్యటించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూమహబూబ్ నగర్ పట్టణంలోని ట్యాంక్ బండ్ పై ఈ నెల 23 న 450 డ్రోన్ ల తో అతి పెద్ద డ్రోన్ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించామని, అయితే గడచిన వారం రోజులనుండి నిరంతరాయంగా వర్షం కురుస్తుండటం ,అంతేకాక రాబోయే 2,3 రోజులు కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున డ్రోన్ ప్రదర్శనను ఈ నెల 28 కి వాయిదా వేసినట్లు తెలిపారు.

వర్షం కారణంగా ఒకేసారి 450 డ్రోన్ లు ఆకాశంలో ఎగర లేవని ,అందువల్ల దీనిని దృష్టిలో ఉంచుకుని డ్రోన్ ప్రదర్శనను ఈనెల 28 కి మార్చినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలు ఈనెల 28 న సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శనకు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement