Monday, April 29, 2024

Praja Bhavanవద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన..

ప్రజాభవన్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్‌ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్మికులు తరలివచ్చారు.

కాగా, ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌ వద్ద బారులు తీరారు. ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement