Monday, April 29, 2024

Breaking: బైకును ఢీకొట్టిన లారీ.. భార్య భర్తలకు తీవ్ర గాయాలు, భ‌ర్త ప‌రిస్థితి విష‌మం

ఎల్లారెడ్డి , (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అన్నా సాగర్ గేట్ సమీపంలో భోధన్‌ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై అశోక్ లీలాండ్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నాసాగర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కొనగొల్ల రాజు, సుజాత భార్యాభర్తలు.. ఇద్దరూ నిజాంసాగర్ మండలం నర్వ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో దర్శనం చేసుకుని రాత్రి ఇంటికి వ‌స్తున్నారు.

కాగా, ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ని ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జిర‌గింది. దీంతో కొనగొల్ల రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. సుజాతకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి ఎల్లారెడ్డి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement