Saturday, May 4, 2024

London – మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాను చేర్చే వరకు పోరాటం ఆగదు – ఎమ్మెల్సీ క‌విత

లండ‌న్ – మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాను చేర్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. భారతదేశంలో ఇటీవల పాసైన మహిళా బిల్లులో ఓబీసీ మహిళలన్ని చేర్చకపోవడం దురదృష్టకమన్నారు. లండన్‌లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, భారతీయ సమాజంలో ఓబీసీల వర్గం చాలా పెద్దదని, వారిని ఆ కోటాలో చేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. సగం జనాభాను ఇంటికి పరిమితం చేస్తే దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల మహిళల్ని చేర్చుకోవడమే ముఖ్యమైన విషయమన్నారు.


భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చిన‌ నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారత్ ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారని, ప్రధాన మంత్రికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement