Tuesday, May 7, 2024

అవ‌యవ‌దానంతో ఇద్ద‌రికి ప్రాణం పోసిన చిన్నారి…

సికింద్రాబాద్‌, ప్రభన్యూస్‌: అతిపిన్న వయసులో అవ యవాలు దానంచేసి చరిత్రలో నిలిచింది ఓ చిన్నారి. 14 నెలల చిన్నారి బ్రెయిన్‌ స్టీమ్‌ డెత్‌తో మరణించి తన రెండు అవయ వాలను దానం చేసి, దక్షిణ భారతదేశంలో అత్యంత చిన్న వయసులో అవయవాలు దానంచేసిన చిన్నారిగా మిగిలి పోయింది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌, సంతోషిలకు కవలలు జన్మిం చారు. ఇందులో మొదటి సంతానం దేవకి శ్రీసాయి. ఆకస్మా త్తుగా డీహైడ్రేషన్‌కి గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ రెండురోజులుగా చికిత్స అందించిన తరువాత కూడా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడక పోవడంతో మెరు గైన చికిత్సకోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌కి తర లించారు. చిన్నారిని రక్షించడానికి వైద్యులు దాదాపు మూడు రోజుల పాటు- శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తూ గురు వారం రాత్రి బ్రెయిన్‌ స్టీమ్‌ డెత్‌తో మరణించింది.

ఆ తర్వాత అవయవదానంపై కిమ్స్‌ ఆస్పత్రిలోని అవయవదాన సమ న్వయకర్తలు, చిన్నారి కుటు-ంబ సభ్యులకు, బంధువులకు, అవగాహన కల్పించారు. అనంతరం తల్లిదండ్రులు, కుటుం బ సభ్యుల అంగీకారంతో కిడ్నీలు, కళ్లు దానం చేశారు. తమ చిన్నారి చనిపోతూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి నందుకు గర్వంగా ఉందని కుటు-ంబ సభ్యులు తెలిపారు. చి న్నారి తండ్రి అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు, తల్లి గృహణి, 14 నెలల చిన్నచెల్లెలు ఉన్నారు. జీవన్‌దాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు- చేసిన గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని జీవన్‌ దాన్‌ కమిటీ- సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement