Friday, April 26, 2024

Banswada : అభివృద్ధిలో వెనుకడుగు వేయ‌బోం.. స్పీక‌ర్ పోచారం

బాన్సువాడ , ప్రభ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వెనకడుగు వేసేది లేదని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాడోకుల్ గ్రామం పరిధిలోని ఆలుగడ్డ వాగుపై లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 40 లక్షల నిధులు మంజులైనాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాన్సువాడ నియోజకవర్గం లో అభివృద్ధి పనుల కోసం ప్రజలు అడగగానే అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్ కోల్ సర్పంచ్ రాజమణి రాజు, ఎంపీటీసీ ఇందిరా రాజు, సొసైటీ మాజీ చైర్మన్ పిట్ల శ్రీధర్, సొసైటీ చైర్మన్ గంగారం, బారాస నాయకులు భూషణ్ రెడ్డి, రాజిరెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement