Thursday, May 2, 2024

TS: ప్రజా ఆశీర్వాద సభకు మహారాష్ట్ర నాయకులు

ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ 8 (ప్రభ న్యూస్) : జిల్లా కేంద్రంలో ఇవాళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజా ఆశీర్వద సభకు రానున్న నేపథ్యంలో భారతీయ రాష్ట్ర సమితి మహారాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు.

మహారాష్ట్ర వాసులు వినూత్నంగా కోవ లక్ష్మి ఫోటోలు ఉన్న బ్యానర్ వేసుకొని ఆకర్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి మాట్లాడుతూ… మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గుస్సాడీ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాంపల్లి శంకర్, బుర్ష పోచయ్య, ఇర్ఫాన్, మహారాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement