Wednesday, May 1, 2024

HYD : ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకై దళిత సంఘాల నేతలు విస్తృత ప్రచారం

ఎల్బీనగర్, డిసెంబర్ 26 (ప్రభ న్యూస్) ఎల్బీనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ,ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి నీ గెలిపించాలని కోరుతూ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు జోగు రాములు ఆధ్వర్యంలో దళిత సంఘాలతో కలిసి ఆదివారం పలు కాలనిలలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జోగు రాములు మాట్లాడుతూ నగరంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక నిధులు తీసుకువచ్చి ఎల్బీనగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన ఘనత దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి దక్కుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఎల్బీనగర్ లో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి మద్దతుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని, అందరం ఐక్యమత్యంగా మద్దతుగా నిలిచి మరోసారి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అడల రమేష్ ,తుర్పటిచిరంజీవి,ఎర్పుల గాలయ్య, యాదయ్య, రాజేందర్, లక్ష్మయ్య తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement