Wednesday, May 1, 2024

రేపే లాసెట్‌ ఫలితాలు…! 21 తర్వాత ఎడ్‌సెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపు (బుధ‌వారం) లాసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లా, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు.

జూలై 21, 22 తేదీల్లో నిర్వహించిన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,921(82.46 శాతం) మంది హాజరయ్యారు. మిగిలిన సెట్స్‌ ఫలితాలు ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎడ్‌సెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌ ఫలితాలను ఈనెల 21 తర్వాత ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement