Monday, April 29, 2024

Big Breaking | ప్రాణాలమీదికి తెచ్చిన భూ వివాదం.. సర్జికల్​ బ్లేడుతో దాడి

వికారాబాద్​ జిల్లాలో ఘోరం జరిగింది. భూ వివాదం కారణంగా ఓ వ్యక్తి సర్జికల్​ బ్లేడుతో ప్రత్యర్థులపై దాడికి తెగబడ్డాడు. మల్​పూర్​ గ్రామంలో ఈ ఘటన ఇవ్వాల (బుధవారం) సాయంత్రం జరిగింది. సర్జికల్​ బ్లేడుతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో భూమి విష‌యంలో వివాదం చెల‌రేగింది. సర్వేనెంబర్ 99లోని రెండు ఎకరాల భూమి కోసం దయాదుల మధ్య గొడవ జ‌రిగింది. దీంతో ఇరు వ‌ర్గాలు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకుని ఇనుప రాడ్లు, క‌ర్ర‌ల‌తో దాడుల‌కు దిగారు. ఈ క్ర‌మంలో తిరుప‌త‌య్య అనే వ్య‌క్తి స‌ర్జిక‌ల్ బ్లేడ్‌తో దాడి చేశాడు.

దీంతో గజ్జి మాసయ్యకు గొంతు దగ్గర తీవ్ర గాయం అయ్యింది. గజ్జి శ్రీనివాస్ కు కడుపులో తీవ్ర గాయం కాగా, మల్లయ్యకు చేతులపై గాయాలయ్యాయి. మరో వర్గానికి చెందిన గజ్జి రాములుకు త‌ల పగలగా, గజ్జి వెంకటయ్యకు తీవ్ర గాయాల‌య్యాయి. బాధితుల‌ను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న నవబ్‌పేట్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement