Sunday, May 19, 2024

ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారికి – ల‌క్ష పుష్పార్చ‌న‌

నేడు ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాంచ రాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు గంటకుపైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. ఈ సందర్భంగా విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement