Wednesday, May 1, 2024

TS: వరంగల్ లో కేటీఆర్ సుడిగాలి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు.

కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నన్నపనేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మొదట రూ.30లక్షల వ్యయంతో చేసిన ఎన్ఐటి జంక్షన్ ను ప్రారంభించారు. ప్రగతి నగర్ లోని 15 బస్తీ దవాఖాన ఎంఎల్డి, టెక్నాలజీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement