Sunday, May 5, 2024

నేడు మహీంద్రా ఈవి ప్లాంట్ ను ప్రారంభించనున్న కేటీఆర్

జహీరాబాద్‌, ఏప్రిల్‌ 23: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌లో కొత్తగా ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ప్లాంట్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరెంతో మంది ఉపాధి పొందుతున్నారు.

జహీరాబాద్‌ మహీంద్రా డివిజనలో ట్రాక్టర్‌ ప్లాంట్‌, మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసే వాహనాలు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారు. కొత్తగా ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారు చేయడంతో ఎంతోమందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. ప్లాంట్‌ ఏర్పాటుపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జహీరాబాద్‌కు చేరుకొని ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement