Monday, April 29, 2024

కరీంనగర్ కు మరో మణిహారం – నేడు కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి కి ప్రారంభోత్సవం

కరీంనగర్ – అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.

ఈ బ్రిడ్జిపై దేశంలోనే తొలిసారిగా డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేస్తుండటం విశేషం. హైదరాబాద్లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇది. మానేరు నదిపై కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement