Monday, April 29, 2024

కీస‌ర‌గుట్ట‌లో కేటీఆర్ ఫ్యామిలీ ప్ర‌త్యేక పూజ‌లు

మ‌హా శివరాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ స‌భ్యులు ఈరోజు ఉద‌యం కీస‌ర‌గుట్ట శ్రీ రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. కేటీఆర్ భార్య శైలిమ‌, కుమారుడు హిమాన్షు క‌లిసి స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. ఆల‌యానికి వేకువజామునే వ‌చ్చిన కేటీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు, మంత్రి మ‌ల్లారెడ్డికి ఆలయ అర్చ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం శైలిమ‌, హిమాన్షు, మంత్రి మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌చ‌నం అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement