Monday, April 29, 2024

కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ.. హాజరు కాని తెలంగాణ!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో గోదావరి, కృష్ణా బోర్డుల ఉమ్మడి అత్యవసర సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో జరగనుంది. ఈ భేటీకి హాజరుకావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డులు లేఖలు రాశాయి. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తెలిపింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో హాజరుకాలేమని, మరో తేదీని ఖరారు చేయాలని తెలంగాణ కోరింది. అయితే, ఈ సమావేశాన్ని యాధావిధిగా కొనసాగించే ఆలోచనలో కృష్ణా, గోదావరి బోర్డులు ఉన్నాయి. సమావేశానికి ఏపీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ఇటీవల జరిగిన సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement